గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ దంపతులు

Kiara Advani and her husband

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హౌత్ర దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హౌత్ర తమ రెండు చేతులు చాచి చిన్నారి సాక్స్‌లు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. తమ జీవితంలోకి గొప్ప భహుమతి త్వరలోనే వస్తుందంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు.

ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కియారా, సిద్దార్ద్ 2023లో వివాహం చేసుకున్నారు. జైపూర్ లోని ఓ పాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల వివాహం జరిగింది. శేష సినిమాలో వీరిద్దరు కలిసి జంటగా నటించారు. ఆ తర్వాత చిత్రీకరణ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే అప్పట్లో వీరు డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది.

కానీ వీళ్లిద్దరు స్పష్టంగా చెప్పలేదు, కాఫీ విత్ కరెంట్ కార్యక్రమంలో పాల్గొన్న కియారా.. రోమ్ నగరంలో సిద్దార్ధ తనకు ప్రపోజ్ చేశారని తెలిపింది. పెళ్లైన నాలుగు నెలలకే కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ న్యూస్ నిజమే అనుకున్నారు అభిమానులు. అయితే ఆ వార్తలు అబద్ధమంటూ కియారా అప్లట్లో క్లారిటీ కూడా ఇచ్చింది. తాజాగా తాను తల్లి కాబోతున్నానంటూ ఒక ఫోటోను పంచుకుంది కియారా. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ సెలబ్రెటీలు కియారా, సిద్దార్ధ్ దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు.

ఇక తన పోస్ట్ కింద రాశీ ఖన్నా, అతియా శెట్టి పలువురు సెలబ్రెటీలు సుభాకాంక్షలు తెలియజేశారు. సమంత ఓ మై గాడ్ కంగ్రాట్యులేషన్స్ అంటూ కామెంట్ పెట్టింది. ఫగ్లీ సినిమాతో వెండి తెరకు పరిచయమైన కియారా.. ఆ తర్వాత పలు సినిమామమల్లో నటించింది. ఇక తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీగా భరత్ అనే నేను సినీమాలో నటించింది. ఆ తర్వాత వినయ విధేయ రామ, ఇటీవల రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం యష్ టాక్జిక్ మూవీతోపాటు హిందీలో వార్ 2 లోకూడా నటిస్టోంది.

తరవాత కథనం