ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో చాలా మంది ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందులో హెవీ బ్లడ్ ప్రెజర్ ఒకటి. శరీరంలో రక్తపోటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండే పరిస్థితిని అధిక రక్తపోటు అంటారు. ఈ రక్తపోటు 120/80 కంటే ఎక్కువగా ఉంటే.. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక రక్తపోటు ఉన్న పేషెంట్స్ వారి జీవనశైలిలో ఒత్తిడి, నిద్ర, ఆహారాన్ని సమతుల్యం చేసుకోవాలి.
అదే సమయంలో ఆహారంలో కొన్ని పోషక విలువలు కలిగిన పండ్లు చేర్చుకోవాలి. అందులో ఆక్రేడు పండు ఒకటి. దీనినే నేరేడు పండు అని కూడా పిలుస్తారు. ఈ పండు బిపిని స్థిరంగా ఉంచడమే కాకుండా గుండె పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు నేరేడు పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఆక్రేడు పండ్లలో పోషకాలు
ఆక్రేడు పండ్లలో విటమిన్ ఎ, సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను, కంటి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నేరేడు పండ్లలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా నేరేడు పండ్లలో లభించే ఫ్లేవనాయిడ్స్ కాటెచిన్, క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ ఆమ్లం రక్తపోటును నివారిస్తాయి. అలాగే, ఈ పండు శరీరంలో సోడియం స్థాయిని నియంత్రిస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అధిక రక్తపోటులో ఆక్రేేడు బెనిఫిట్స్
పొటాషియం అధికంగా ఉండే నేరేడు పండ్లు రక్త నాళాల ఉద్రిక్తతను తగ్గిస్తాయి. అవి రక్త నాళాలను తెరచి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనితో పాటు, ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఎలా తినాలి
అధిక రక్తపోటు ఉన్న రోగులు తాజా నేరేడు పండ్లను తినాలి. ఇందులో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ అవి మీకు అందుబాటులో లేకపోతే మీరు ఎండిన ఆప్రికాట్లను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో నీటితో పాటు తినవచ్చు.